ఐపీఎల్‌-7 వేలం ప్రారంభం: యువరాజ్ ధర రూ.14 కోట్లు | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-7 వేలం ప్రారంభం: యువరాజ్ ధర రూ.14 కోట్లు

Published Wed, Feb 12 2014 10:25 AM

యువరాజ్ సింగ్ - Sakshi

ముంబై: ఐపీఎల్‌-7 వేలం పాటలు ప్రారంభమయ్యాయి.  యువరాజ్ సింగ్ ధర 14 కోట్ల రూపాయలు ధర పలికాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యువరాజ్‌ను దక్కించుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌ కెవిన్‌ పీటర్సన్‌ను 9 కోట్ల రూపాయలకు, మురళీ విజయ్‌ను 5 కోట్ల రూపాయలకు   కొనుగోలు చేసింది.

నైట్‌రైడర్స్ కల్లిస్‌ను 5 కోట్ల 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. పంజాబ్ మిషెల్ జాన్సన్ను  5 కోట్ల 50 లక్షల రూపాయలకు, సెహ్వాగ్‌ను  3 కోట్ల 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ను హైదరాబాద్‌ దక్కించుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement