ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఈడీ దాడులు | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఈడీ దాడులు

Published Fri, May 22 2015 11:06 AM

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఈడీ దాడులు - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ, ముంబై, జైపూర్ సహా పలు నగరాల్లో అధికారులు సోదాలు చేశారు.

ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ల మ్యాచ్లో బెట్టింగ్లో ప్రమేయమున్న అనూప్ మహాజన్ అనే బుకీని పఠాన్కోట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 3.3 లక్షల నగదు, మొబైల్స్, ఎల్సీడీ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కేసులో పోలీసులు మరో ఐదుగురిని కూడా  అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 

Advertisement
Advertisement