Sakshi News home page

ఐపీఎల్ ఫిక్సింగ్; మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు

Published Mon, Jan 18 2016 2:17 PM

ఐపీఎల్ ఫిక్సింగ్; మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది.

2013 ఐపీఎల్ సీజన్లో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా, తాజాగా చండీలా, ముంబై క్రికెటర్ హీకేన్ షాలపై చర్యలు తీసుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement