‘డబుల్స్’కు ప్రాధాన్యతపై ప్రశ్నిస్తున్నా
గుత్తా జ్వాల వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: సింగిల్స్తో పోలిస్తే డబుల్స్కు గుర్తింపు దక్కడం లేదని తాను పదే పదే అనడం వివాదం చేయడానికి కాదని, భవిష్యత్తు షట్లర్ల కోసమేనని బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్లో రజత పతకం సాధించిన జ్వాల స్వస్థలం తిరిగి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఆమె ప్రదర్శనతో పాటు ఇతర అంశాలపై సాక్షితో మాట్లాడింది. విశేషాలు జ్వాల మాటల్లోనే...
చీఫ్ కోచ్ వ్యూహాలు, సలహాలపై..: నా గెలుపును కోరుకునేవారి దగ్గరే నేను సలహాలు, సూచనలు తీసుకుంటాను. కొద్ది సేపు మధుమిత బిస్త్తో మాట్లాడటం మినహా ఫైనల్లో చీఫ్ కోచ్తో ఎలాంటి వ్యూహాల గురించి చర్చించలేదు.
భారత జాతీయ కోచ్గా ఏదైనా చెప్పడం ఆయన బాధ్యత. కానీ నా అంతట నేను వెళ్లి అడగను. అసలు ఆ అవసరం నాకు లేదు. ప్రతీ మ్యాచ్కు ముందు ఫోన్లో ఆరిఫ్ సర్తో మాట్లాడేదాన్ని. ఇక 2010లో విజయం తర్వాత అకాడమీలో జరిగిన విజయోత్సవంలో నేనూ పాల్గొన్నాను. ఈ సారి మాత్రం నన్ను పిలవలేదు కాబట్టి వెళ్లలేదు!
సింగిల్స్ను డబుల్స్తో పోల్చడం: నేను దీనిపై మాట్లాడిన ప్రతీ సారి ‘సింగిల్స్, డబుల్స్ ఎలా సమానం’ అంటూ అంతా నన్నే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ఏ క్రీడాకారుడికైనా అంతే కఠోర శ్రమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏ దేశంలోనూ ఈ రకమైన విచక్షణ లేదు. జ్వాల డబుల్స్ స్పెషలిస్ట్ కావడం వల్లనే ఇలా చేస్తున్నారేమో నాకు తెలీదు! వ్యక్తిగతంగా చూస్తే ప్రపంచ చాంపియన్షిప్ సహా ఎన్నో ఘనతలు సాధించాను. ఒక్క స్పాన్సర్ లేకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒక వైపు వారితో పోరాడుతూనే మరో వైపు ఇవి గెలిచాను. కానీ నాకు కంగ్రాట్స్ చెప్పేవారు, స్వాగతం పలికేవారు ఎవరూ లేకపోయారు. నేను మౌనంగా ఎలా ఉండను? ఎవరో ఒకరు ప్రశ్నించాలిగా. ఈ పరిస్థితిని మార్చకుంటే భవిష్యత్తులో ఎవరూ డబుల్స్ను ఎంచుకోరు. దీనిపై హెచ్చరించేందుకే నేను పదే పదే గుర్తింపు ఇవ్వమని కోరుతున్నా.
నగదు పురస్కారంపై ఇటీవలి సైనా వ్యాఖ్యలపై..: ఆమె టైమింగ్ తప్పు అనేది నా నిశ్చితాభిప్రాయం! సైనా స్థాయి ప్లేయర్లకు సీఎం లేదా కనీసం మంత్రి అయినా అందుబాటులో ఉంటారు. నేరుగా చెప్పుకోవచ్చు తప్ప మీడియాకెక్కాల్సిన అవసరం లేదు. నేనైతే డబ్బు గురించి అలా చెప్పను. పైగా సానియాతో పోలుస్తూ అడగటం సరైంది కాదు. ఇవాళ సీఎం ప్రోత్సాహకం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నింటినిమించి తొలిసారి ఆరిఫ్ సర్కు కూడా బహుమతి ప్రకటించడం ఆనందం గా ఉంది.
నా కోసం కాదు... ఆట కోసమే!
Published Thu, Aug 7 2014 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement