దుబాయ్:సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కు మరోసారి చుక్కెదురైంది. పురుషుల గ్రూప్-బి మ్యాచ్ లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో శ్రీకాంత్ 17-21, 13-21 తేడాతో చో తియాన్ చెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. కేవలం 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో శ్రీకాంత్ పేలవంగా ఆడి టోర్నీ నుంచి నిష్ర్రమించాడు.
అంతకుముందు రెండు వరుస ఓటములతో సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్ ఆశలను శ్రీకాంత్ క్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో లీగ్ మ్యాచ్ లో శ్రీకాంత్ 13-21, 18-21తో అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చెందగా, తొలి మ్యాచ్ లో శ్రీకాంత్ 13-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో మట్టికరిచాడు.