శుభారంభం లభించినా.. | Sakshi
Sakshi News home page

శుభారంభం లభించినా..

Published Sun, May 1 2016 5:48 PM

శుభారంభం లభించినా.. - Sakshi

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు కెప్టెన్ మురళీ విజయ్(55;41 బంతుల్లో 6 ఫోర్లు), స్టోయినిస్(27;17 బంతుల్లో 3 ఫోర్లు,  1 సిక్స్) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్ కు 40 బంతుల్లో  65 పరుగులు నమోదు చేసి శుభారంభం అందించినా.. ఆ తరువాత పంజాబ్ వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

పంజాబ్ టాపార్డర్ ఆటగాళ్లలో షాన్ మార్ష్(1), మ్యాక్స్వెల్(0), గురకీరత్ సింగ్(0) లు తీవ్రంగా నిరాశపరిచారు.   మురళీ విజయ్ తో పాటుడేవిడ్ మిల్లర్(31), సాహా(33;19 బంతుల్లో 4ఫోర్లు) లు  ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ 154 పరుగులు స్కోరును నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో శివిల్ కౌశిక్ మూడు వికెట్లతో రాణించగా, బ్రేవో, ప్రవీణ్ కుమార్ లు తలో రెండు వికెట్లు సాధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement