టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌

Published Sat, May 12 2018 3:44 PM

Kings Punjab won the toss and elected to field first - Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శనివారం ఇక్కడ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించింది.

ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ 10 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపొంది మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్‌ 11 మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఐదో స్థానంలో ఉంది.

తుది జట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, శుభ్‌మాన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఆండ్రీ రస్సెల్‌, జావోన్‌ సీర్లెస్‌, పీయూష్‌ చావ్లా, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌

కింగ్స్‌ పంజాబ్‌

అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అరోన్‌ ఫించ్‌, కరుణ్‌ నాయర్‌, అక్షర్‌ పటేల్‌, ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, బరీందర్‌ శ్రాన్‌, ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌

Advertisement
Advertisement