దుబాయి: టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ జస్ప్రిత్ బూమ్రాలు వన్డే ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్నారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్లో వీరిద్దరూ తమ టాప్ ప్లేస్ను నిలుపుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లి 884 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా, బౌలింగ్ విభాగంలో బూమ్రా 797 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానాన్ని నిలుపుకున్నాడు.
ఇక రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకోగా, శిఖర్ ధావన్ 802 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్ విషయంలో భారత జట్టు 122 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్ ప్లేస్లో ఇంగ్లండ్(127 పాయింట్లు) ఉండగా, న్యూజిలాండ్(112), దక్షిణాఫ్రికా(110)లు తదుపరి స్థానాల్లో నిలిచాయి.