పుణె: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ శనివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఆదిలో ఆందోళనకు గురైంది. వరుసుగా వికెట్లు చేజార్చుకున్న కోల్ కతా ఆండ్రీ రస్సెల్ దూకుడుతో తేరుకుని టోర్నీలో అద్భుత విజయాన్ని సాధించింది. 60 పరుగులకే ఐదు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న కోల్ కతాను రస్సెల్ (66; 36 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్(28;4 ఫోర్లు) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్ కు 95 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడంతో కోల్ కతా ఇంకా 13 బంతులు ఉండగానే జయభేరీ మోగించింది. మ్యాచ్ చివర్లో రస్సెల్ ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగినా.. అప్పటికే కోల్ కతా విజయం ఖరారైంది. కోల్ కతా ఆటగాళ్లలో రాబిన్ ఊతప్ప (13), మనీష్ పాండే(11) , సూర్య కుమార్ యాదవ్(23), గౌతం గంభీర్(11) , డెస్కోటీ(0) లు పెవిలియన్ చేరి నిరాశపరిచినా.. చివరకు విజయం సాధించడం ఆ జట్టు అభిమానులకు ఊరటనిచ్చింది. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడిన కింగ్స్ పంజాబ్ 156 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. పంజాబ్ ఆదిలోనే మురళీ విజయ్ వికెట్ ను డకౌట్ రూపంలో కోల్పోయింది. అనంతరం వృద్ధిమాన్ సాహా(15), వీరేంద్ర సెహ్వాగ్(11) పరుగులు చేసి పెవిలియన్ చేశారు. ఆ తరుణంలో మ్యాక్స్ వెల్, జార్జ్ బెయిలీలు పంజాబ్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టారు. అయితే మ్యాక్స్ వెల్(33) భారీ షాట్ కు యత్నించి నాల్గో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత తిషారా పెరీరా(9),గుర్ కీరత్ సింగ్(11), అక్షర్ పటేల్(2) నిరాశ పరచడంతో స్కోరు మందగించింది. కాగా కెప్టెన్ బెయిలీ (60) ఒక్కడే మరోసారి ఆకట్టుకోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
కోల్ కతా గ్రాండ్ విక్టరీ
Published Sat, Apr 18 2015 11:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement