ఆంధ్రప్రదేశ్ ఓటమి | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ ఓటమి

Published Sun, Mar 2 2014 2:07 AM

loss the match by andhra pradesh

 న్యూఢిల్లీ: జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు 31-87 తేడాతో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిహాల్ యాదవ్ 8, బాజిద్ బాషా 6 పాయింట్లతో రాణించినా..

ఏపీ జట్టు నాలుగు క్వార్టర్లనూ కోల్పోయింది. రాజస్థాన్ వరుసగా 21-16, 24-2, 13-4, 29-9 తేడాతో ఆధిక్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్‌లో ఇండియన్ రైల్వేస్ జట్టు 80-58 తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో మహారాష్ట్ర 60-56 తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై, పంజాబ్ 79-59తో తమిళనాడుపై, కర్ణాటక 75-67తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందాయి.
 

Advertisement
Advertisement