లంచ్ సమయానికి భారత్ స్కోరు: 89/1 | Sakshi
Sakshi News home page

లంచ్ సమయానికి భారత్ స్కోరు: 89/1

Published Wed, Dec 17 2014 7:46 AM

Lunch - Day 1:  India score 89 runs fall one wicket at the time of lunch

బ్రిస్బ్రేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య  బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ లంచ్ విరామ సమయానికి 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఆదినుంచి దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ 75 బంతుల్లో 6 ఫోర్లు బాది 46 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.  విజయ్ భాగస్వామ్యంతో  పుజారా 36 బంతుల్లో 1 ఫోర్ బాది 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అంతకముందు భారత్ ఆటగాడు ధావన్ 39 బంతుల్లో 24 పరుగులతో షాన్మార్ష్ బౌలింగ్లో హడిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లంచ్ సమయానికి భారత్ ఆటగాళ్లు విజయ్(46) పుజారా(15) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్ మార్ష్ ఒక వికెట్ తీశాడు.

Advertisement
Advertisement