♦ పాక్తో మ్యాచ్కు ముందు ధోని పట్టుదల
♦ గుర్తు చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్
చెన్నై: ఆట పట్ల మహేంద్ర సింగ్ ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తాడనేది వాస్తవం. దీనికి మరో ఉదాహరణ గత ఆసియా కప్ సమయంలో జరిగిన ఘటన. ఇక్కడ జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయాన్ని పంచుకున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు రెండు రోజుల ముందు జిమ్లో ఎక్సర్సైజ్లు చేసే సమయంలో ధోని వెన్నుకు తీవ్ర గాయమైంది.
అసలు ఏ మాత్రం నడవలేని స్థితిలో ఉన్న అతడిని స్ట్రెచర్పై తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆందోళన చెందిన ఎమ్మెస్కే నేరుగా ధోని గదికి వెళ్లారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ‘ఏం ఫర్వాలేదు ఎమ్మెస్కే భాయ్ అని ధోని నాతో ఒకే ఒక్క మాట అన్నాడు. మీడియాతో ఏం చెప్పాలని అడిగినా అతను మళ్లీ అదే మాట అన్నాడు. ఎందుకైనా మంచిదని నేను పార్థివ్ పటేల్ను అందుబాటులో ఉండమని కూడా చెప్పాను.
సరిగ్గా మ్యాచ్కు కొద్దిసేపు ముందు ధోని టీమ్ డ్రెస్సుతో సిద్ధమైపోయాడు. నా వద్దకు వచ్చి ఎందుకు అంతగా ఆందోళన పడిపోతున్నావు. ఒక కాలు కోల్పోయినా సరే... పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటా అని ధోని నాతో చెప్పాడు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన ధోని ఎందరికో స్ఫూర్తినిచ్చాడు’ అని ప్రసాద్ మాజీ కెప్టెన్పై ప్రశంసలు కురిపించారు.
ఒంటి కాలితో అయినా ఆడతానన్నాడు
Published Tue, Aug 29 2017 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement