సెమీస్‌లో మేఘన, సామియా | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో మేఘన, సామియా

Published Fri, Nov 11 2016 11:24 PM

Meghna  ,  samiya enter to  semis

ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ 

హైదరాబాద్: ఆలిండియా సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మేఘన, సామియా ఇమాద్ ఫరూఖీ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కర్నూలులో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగిన అండర్-13 బాలికల క్వార్టర్స్‌లో మేఘనా రెడ్డి (తెలంగాణ) 14-21, 21-19, 21-14తో విజేత హరీశ్ (కర్నాటక)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో తస్నీమ్ మీర్ (గుజరాత్) 21-11, 21-9తో అవంతిక పాండే (ఉత్తరప్రదేశ్)పై, అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్) 21-14, 21-15తో రీతూ షా (కర్నాటక)పై, శ్రద్ధా హెగ్డే (కర్నాటక) 20-22, 21-16, 21-18తో ఆయేషా సింగ్ (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించారు.

అండర్-15 బాలికల క్వార్టర్స్‌లో సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ) 21-9, 21-16తో భార్గవి (తెలంగాణ)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో రిచా ముక్తిబోధ్ (కర్నాటక) 21-16, 24-22తో అదితి భట్ (ఢిల్లీ)పై, మేధ (కర్నాటక) 21-15, 21-15తో కేయూర (తెలంగాణ)పై,  మహేశ్వరి 23-21, 21-14తో మేఘన (తెలంగాణ)పై నెగ్గారు. అండర్-15 బాలుర రెండో రౌండ్ మ్యాచ్‌లో యశ్వంత్ రామ్ (తెలంగాణ) 20-22, 21-10, 21-10తో శ్రీధర్ శ్రీకుమార్ (కేరళ)పై విజయం సాధించాడు.

ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు
అండర్-13 బాలుర సింగిల్స్: ప్రణవ్ రావు (తెలంగాణ) 21-13, 21-8, 21-4తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై, శశాంక్ (తెలంగాణ) 21-16,7-21, 21-18తో నిఖిల్ ఛత్రిపై, వంశీకృష్ణ (ఏపీ) 19-21, 21-16, 21-12తో అతుల్ జాన్ మాథ్యూ (కేరళ)పై, ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21-12, 21-12తో సంతృప్త్‌పై గెలుపొందారు. 

 

Advertisement
Advertisement