బర్డ్ అవుట్: మెన్నీఇన్ | Sakshi
Sakshi News home page

బర్డ్ అవుట్: మెన్నీఇన్

Published Fri, Oct 28 2016 3:05 PM

బర్డ్ అవుట్: మెన్నీఇన్

మెల్బోర్న్:త్వరలో దక్షిణాఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టులో తొలిసారి జో మెన్నీ స్థానం దక్కించుకున్నాడు. గతేడాది కాలంగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఆకట్టుకుంటున్న మెన్నీకి 12 మంది సభ్యులతో కూడిన జాతీయ జట్టులో స్థానం కల్పిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో ఆ దేశంతో జరిగిన వన్డే సిరీస్లోఅంతర్జాతీయ క్రికెట్ ను ఆరంభించిన మెన్నీని టెస్టుల్లో కూడా ఎంపిక చేశారు.  దాంతో పాటు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను కూడా తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

టెస్టుల్లో మెన్నీకి స్థానం కల్పించడానికి గత కొంతకాలంగా ఫస్ట్ క్లాస్లో నిలకడైన ప్రదర్శన చేయడమేనని చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్ తెలిపారు. అతని ఎంపికకు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడంతో పాటు, సుదీర్ఘమైన స్పెల్ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేయడమేనని మార్ష్ పేర్కొన్నాడు. గత సీజన్ షెఫెల్డ్ షీల్డ్ టోర్నీలో మెన్నీ అత్యధిక వికెట్లను సాధించడం కూడా మరో కారణమైంది. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న జాక్సన్ బర్డ్ను సీఏ పక్కన పెట్టేసింది. 2012లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బర్డ్కు  స్థానం దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది.

Advertisement
Advertisement