కరాచీ:పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ తన క్రికెట్ కెరీర్పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరే ముందే మిస్బా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుదామని మిస్బా భావించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విన్నపం మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. అయితే మిస్బా తన క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు పీసీబీ ఉన్నతాధికారి తెలిపారు. ఇంగ్లండ్ తో సిరీస్కు మిస్బా కెప్టెన్ గా వ్యవహరించనున్నా, ఆ పర్యటనకు బయల్దేరే ముందే తన వీడ్కోలు నిర్ణయాన్ని మిస్బా వెల్లడించే అవకాశం ఉందన్నారు.
గతేడాది ఏడాది ప్రపంచకప్లో ఆసీస్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు, టీ 20లకు మిస్బా గుడ్ బై చెప్పాడు. పాకిస్తాన్ విజయాల్లో అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా మిస్బా కీలక పాత్ర పోషించాడు. 2012, 2015 సంవత్సరాల్లో ఇంగ్లండ్ పై పాక్ గెలిచిన రెండు టెస్టు సిరీస్ లకు మిస్బానే కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఆ రెండు టెస్టు సిరీస్లు యూఏఈలో జరిగాయి. కాగా, త్వరలో ఇంగ్లండ్ లో ఆరంభం కానున్న టెస్టు సిరీస్ నుంచి మాత్రం 42 ఏళ్ల మిస్బాకు తీవ్రమైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది.
వీడ్కోలుపై మిస్బా త్వరలో నిర్ణయం!
Published Thu, Jun 16 2016 5:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గడ్డివాము దగ్ధం
ఐడియా అదిరింది..!
ఇక్కడ చెల్లనిది అక్కడ చెల్లుతోంది
‘ప్రేరణ’కు జ్యోతీబా పూలే విద్యార్థిని భవిజ్ఞ
వెలవెలబోతున్న ‘వరప్రదాయిని’
ప్రభుత్వాధీనంలోనే షుగర్ ఫ్యాక్టరీలను నడిపిస్తాం
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అనారోగ్యంతో తల్లి.. బెంగతో కూతురు మృతి
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
అదనపు ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement