శ్రీనివాసన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని పవార్ అనుమతించారని గుర్తుచేశారు. చెన్నైలో జరిగిన ఐసీసీ ఈవెంట్లో పాల్గొన్న శ్రీని విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఇండియా సిమెంట్స్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్రపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ధోనిని రాజీనామా చేయాలని అడిగారా? అన్న ప్రశ్నకు శ్రీనివాసన్ స్పందిస్తూ.. ‘నేనెందుకు ధోనిని రాజీనామా చేయమని అడగాలి? ఇండియా సిమెంట్స్లో అతడి పాత్ర గురించి మీకెందుకు చెప్పాలి. అలాగే ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్కు వచ్చిన ముప్పేమీ లేదు’ అని తేల్చి చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ విచారణ కోర్టు పరిధిలో ఉండడంతో ఆ విషయంపై తానేమీ మాట్లాడనని చెప్పారు.
సుప్రీం విచారణ 8కి వాయిదా
జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదికపై సోమవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఐపీఎల్లో బెట్టింగ్కు పాల్పడినట్టు తెలిసిన వెంటనే గురునాథ్ మెయ్యప్పన్, రాజ్కుంద్రాలపై బీసీసీఐ ఫిర్యాదు చేసిందని శ్రీనివాసన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. అలాగే పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి ముకుల్ ముద్గల్ కమిటీ లేక బాంబే హైకోర్టు కూడా శ్రీనివాసన్కు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.
శ్రీనిని బోర్డు పదవి నుంచి తొలగించాలనే ఏకైక లక్ష్యం ప్రత్యర్థికి కనిపిస్తోందని వాదించారు. అయితే ఈ విషయంలో నిరూపించుకోవాల్సింది శ్రీనివాసనేనని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడి బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే అరుణ్ జైట్లీ సూచనల మేరకు ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంపై బీసీసీఐ ప్యానెల్ ఏర్పాటైందని పదేపదే సిబల్ పేర్కొనడంపై కోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టులో లేని వ్యక్తి గురించి, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి గురించి అదే పనిగా మాట్లాడటం సరికాదని తెలిపింది. శ్రీనివాసన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ఈరోజు (సోమవారం) విచారణ జరుగుతుందని పేర్కొంది. విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.
పవార్ సలహాతోనే బిడ్ వేశాను
Published Tue, Dec 2 2014 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement