నర్సింగ్ నిషేధానికి గురికాకపోయి ఉంటే.. | Sakshi
Sakshi News home page

నర్సింగ్ నిషేధానికి గురికాకపోయి ఉంటే..

Published Fri, Aug 26 2016 8:26 PM

నర్సింగ్ నిషేధానికి గురికాకపోయి ఉంటే..

ముంబై: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధానికి గురికాకపోయిఉంటే భారతదేశానికి వెండి పథకం సాధించి ఉండేవాడని  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సెక్రెటరీ వీఎన్ ప్రసూద్ తెలిపారు.  ముంబైలో ఒక  కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో నర్సింగ్ శిక్షణ పొందిన సోనేపేట్ క్యాంప్ లో తనపై కుట్ర జరిగిందని నాడా సైతంకు క్లీన్ చీట్ ఇచ్చిన విషయాన్ని ప్రసూద్ గుర్తు చేశారు. నర్సింగ్ పై ఆరోపణలను నిరూపించకుండానే నాలుగేళ్లు నిషేధం విధించారని చెప్పారు. ఈ వివాదంపై సీబీఐ తో విచారణ జరిపించి నిజాలను నిగ్గుతేల్చాలని డబ్ల్యూఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Advertisement
Advertisement