హామిల్టన్: పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టులో పాకిస్తాన్ 230 పరుగులకే పరిమితం కావడంతో న్యూజిలాండ్ 138 పరుగులతో విజయం సాధించి సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ విసిరిన 369 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పాక్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు సమీ ఇస్లామ్(91), అజహర్ అలీ(58) మినహా ఎవరూ రాణించలేదు.
1/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి నిలవలేక స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఐదుగురు పాక్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో వాగ్నర్ మూడు వికెట్లు సాధించగా,టిమ్ సౌథీ, సాంత్నార్లు తలో రెండు వికెట్లు తీశారు. గ్రాండ్ హోమ్, హెన్రీలకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ పై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గెలవడం దాదాపు 31 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1985 లో చివరిసారి పాక్ పై న్యూజిలాండ్ 2-0 తో గెలిచింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 12 టెస్టు సిరీస్లు జరగ్గా, అందులో న్యూజిలాండ్ ఏడింటిని కోల్పోయింది. మరో ఐదింటిని డ్రా చేసుకుంది.
30 ఏళ్ల తరువాత తొలిసారి..
Published Tue, Nov 29 2016 10:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement