ఆ ఆలోచనే లేదు: సెహ్వాగ్ | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచనే లేదు: సెహ్వాగ్

Published Mon, Feb 2 2015 7:04 PM

ఆ ఆలోచనే లేదు: సెహ్వాగ్

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ లో చోటు దక్కనప్పటికీ క్రికెట్ కు ఇప్పడప్పుడే దూరం కాబోనని టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు. కనీసం రెండేళ్లు క్రికెట్ ఆడతానని, అప్పటివరకు ఆటపైనే దృష్టి పెడతానని తెలిపాడు.

'నేనిప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. ఆడినంతకాలం ఆటలో కొనసాగుతాను. ఇంకేమీ ఆలోచించడం లేదు. ఆటపై మక్కువ తీరేంతవరకు రిటైర్మెంట్ ప్రసక్తే లేదు' అని సెహ్వాగ్ అన్నాడు. వరల్డ్ కప్ కోసం 30 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన జట్టులో సెహ్వాగ్ కు స్థానం దక్కని విషయం తెలిసిందే.

Advertisement
Advertisement