వెల్టింగ్టన్: గత ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదని లండన్ కోర్టు తేల్చడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఊపిరి పీల్చుకుంది. ఆ కేసులో కెయిన్స్ నిర్దోషిగా తేలడంతో వాస్తవాలు ఏమిటో ప్రజలు తెలుసుకున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ స్టువర్ట్ హీల్ తెలిపారు. ఈ తీర్పు అనంతరం హీల్ న్యూజిలాండ్ రేడియోతో మాట్లాడుతూ..ఇది తమ క్రికెట్ కు చాలా ఆరోగ్యకరమైన తీర్పుగా పేర్కొన్నారు. ఒకవేళ ఎటువంటి తీర్పు లేకుండా కేసు ముందుకు సాగితే మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉండేదన్నారు. కెయిన్స్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న కాలం అంతా కూడా క్రికెట్ కుటుంబానికి దుర్దినాలుగా హీల్ అభిప్రాయపడ్డారు. 'ఇది ఒక కెయిన్స్ ఫ్యామిలీకే కాదు.. అందులో ఉన్న సాక్షులకూ కష్టకాలం. ఇందులో విజేతలు ఎవరూ లేరు' అని హీల్ తెలిపారు.
కెయిన్స్ ను నిర్దోషిగా తేలుస్తూ లండన్లోని సైత్వార్క్ క్రౌన్ న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించింది. కెయిన్స్తో పాటు అతని స్నేహితుడు ఫిచ్ హాలండ్ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని లలిత్ మోడీ 2010లో ట్వీట్ ద్వారా దుమారం రేపారు. దీనికి ఆగ్రహించిన కెయిన్స్ 2012లో కోర్టును ఆశ్రయించి రెండేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తరువాత రకరకాల మలుపులు తిరిగిన ఈ కేసు విచారణ ఎట్టకేలకు ఎటువంటి వివాదం లేకుండా ముగిసింది.
'అవి క్రికెట్ కు దుర్దినాలు'
Published Tue, Dec 1 2015 4:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement