ద్వైపాక్షిక సిరీస్లపై చర్చ
దుబాయ్: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు సంబంధించి ఈ నెల 29న కీలక సమావేశం జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు దుబాయ్లో జరిగే ఈ భేటీలో పాల్గొంటారు. ఎంఓయూ ప్రకారం 2015–2023 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో ఇరు జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్లు జరగాల్సి ఉంది.
అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇందులో ఒక్క సిరీస్ కూడా జరిగే అవకాశం కనిపిం చడం లేదు. ఇదే విషయంపై ఇటీవల పీసీబీ, భారత్కు నోటీసు పంపించగా... ఎంఓయూ అసలు ఒప్పందమే కాదం టూ బీసీసీఐ తేలిగ్గా తీసిపారేసింది. ఈ నేపథ్యంలో సాగే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
ప్రభుత్వం అనుమతిస్తేనే...
మరో వైపు ద్వైపాక్షిక సిరీస్ల విషయాన్ని ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని, అక్కడి నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘భారత్, పాక్ క్రికెట్ సిరీస్ల విషయంలో యథాతథ స్థితే కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి ముందడుగు లేదు. మూడు నెలల క్రితమే భారత ప్రభుత్వానికి అనుమతి కోరుతూ లేఖ రాశాం. మళ్లీ 15 రోజుల క్రితం ఇదే విషయాన్ని గుర్తుచేశాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. పాక్తో ఆడటమనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇందులో మేం చేయగలిగిందేమీ లేదు’ అని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు.
29న బీసీసీఐ, పీసీబీ సమావేశం
Published Fri, May 26 2017 12:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement