పాక్‌తో క్రికెట్ సిరీస్ తగదు | Sakshi
Sakshi News home page

పాక్‌తో క్రికెట్ సిరీస్ తగదు

Published Tue, May 12 2015 1:40 AM

Pak cricket series inappropriate

కేంద్రానికి బీజేపీ ఎంపీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత్ పై దాడులకు దిగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని బీజేపీ ఎంపీ ఆర్‌కే సిన్హా లోక్‌సభలో సూచించారు. రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్‌కు అనుమతి ఇవ్వవద్దని సోమవారం జీరో అవర్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘హఫీజ్ సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. జకీయుర్ రెహమాన్ లఖ్వీకి ఇటీవలే పాక్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్రం దీనికి అనుమతి ఇవ్వకూడదు’ అని మాజీ హోం కార్యదర్శి కూడా అయిన సిన్హా కోరారు.

Advertisement
Advertisement