పట్నా పైరేట్స్‌ ఐదో విజయం | Sakshi
Sakshi News home page

పట్నా పైరేట్స్‌ ఐదో విజయం

Published Sun, Nov 11 2018 2:55 AM

Patna Pirates fifth win - Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ ఐదో విజయం నమోదు చేసుకుంది. బెంగాల్‌ వారియర్స్‌తో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 50–30తో గెలిచింది. ‘డుబ్కీ’ కింగ్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 11, దీపక్‌ నర్వాల్‌ 13 పాయింట్లతో చెలరేగారు.  ఈ మ్యాచ్‌ను బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ స్నేహితులతో కలిసి వీక్షించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 38–36తో యు ముంబాపై విజయం సాధించింది.  

Advertisement
Advertisement