సిరీస్ నెగ్గిన శ్రీలంక | Sakshi
Sakshi News home page

సిరీస్ నెగ్గిన శ్రీలంక

Published Sun, Aug 7 2016 2:00 AM

సిరీస్ నెగ్గిన శ్రీలంక - Sakshi

గాలె: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక మరో టెస్టు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో శ్రీలంక 229 పరుగులతో గెలిచింది. 413 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు... 25/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 50.1 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. వార్నర్ (41), స్మిత్ (30) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో పెరీరా 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. మ్యాచ్‌లో పది వికెట్లు తీయడంతో పాటు అర్ధసెంచరీ చేసిన దిల్‌రువాన్ పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టెస్టు 13 నుంచి జరుగుతుంది.

Advertisement
Advertisement