గాలె: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ను శ్రీలంక మరో టెస్టు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో శ్రీలంక 229 పరుగులతో గెలిచింది. 413 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు... 25/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 50.1 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. వార్నర్ (41), స్మిత్ (30) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో పెరీరా 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. మ్యాచ్లో పది వికెట్లు తీయడంతో పాటు అర్ధసెంచరీ చేసిన దిల్రువాన్ పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టెస్టు 13 నుంచి జరుగుతుంది.
Related News by category
-
గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదానికి బలైన తెనాలికి చెందిన గొల్తి గీతాంజాలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ యూకే విభాగం అండగా నిలిచింది. ఆమె ఇద్దరు పిల్లలు రిషిత(10), రుషిక(6) పేర్లతో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను బ్యాంక్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. డిపాజిట్ పత్రాలను శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గీతాంజలి భర్త గొల్తి బాలచందర్, కుమార్తెలు రిషిత, రుషికకు అందజేశారు. పిల్లలను బాగా చదివించాలని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా వైఎస్సార్ సీపీని సంప్రదించాలని బాలచందర్కు సజ్జల సూచించారు. బాలచందర్ మాట్లాడుతూ గీతాంజలి చనిపోయిన కొన్ని గంటల్లోనే సీఎం వైఎస్ జగన్ స్పందించి బతుకుపై తమ కుటుంబానికి భరోసా కల్పించారని తెలిపారు. ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ యూకే విభాగం కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుల్రెడ్డి ఆధ్వర్యాన ఎ.సురేంద్రరెడ్డి, యూకేలోని వైఎస్సార్సీపీ విభాగం సభ్యులు అందరూ కలిసి మా పిల్లల పేరు మీద రూ.20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలు అందజేశారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చల్లా మధు, ఎన్ఆర్ఐ కాశీపతి పాల్గొన్నారు. -
హైకోర్టుకన్నా మీరే ఎక్కువా?
సాక్షి, అమరావతి: ‘హైకోర్టుకన్నా మీరే ఎక్కునుకుంటున్నారా? సంక్షేమ పథకాల నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు’అంటూ ఎన్నికల సంఘం (ఈసీ)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం నిప్పులు చెరిగింది. ‘2019లో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల విడుదలకు అనుమతిచ్చారు. మొన్న తెలంగాణలో రైతు బంధు పథకానికి అనుమతించారు. ఇక్కడా అనుమతి కోరింది పాత పథకాలకే కదా! అప్పుడు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవకు అనుమతిచ్చిన వాళ్లు ఇప్పుడెందుకు అనుమతి ఇవ్వరు ’అని గట్టిగా నిలదీసింది. సంక్షేమ పథకాల అమలుకు అనుమతినిచ్చే విషయంలో ఈసీ తీరు ఆందోళన కలిగిస్తోందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరించడం ఏమిటని వ్యాఖ్యానించింది. ‘నిధుల పంపిణీకి బ్రేక్ వేస్తూ మీరు ఇచి్చన ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్లో పెట్టిన తరువాత కూడా నిధుల పంపిణీకి ఎన్వోసీ ఇవ్వకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా వివరణ కోరతారని మండిపడింది. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా నిధుల పంపిణీ చేయకూడదని చట్టం ఏదైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘సింగిల్ జడ్జి తీర్పుపై ఎన్నికల సంఘం అప్పీల్ చేసిందా? ఎన్నికల సంఘానికి లేని అభ్యంతరం మీకెందుకు’అని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్ రాష్ట్రంలోని పేదల అభ్యున్నతికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల్లో కొన్నింటికి నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఈ నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. పోలింగ్ ముగిసే వరకు నిధుల పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశాలివ్వడంతో నిధుల పంపిణీ ఆగిపోయింది. ఈసీ నిర్ణయంపై పలువురు రైతులు, మహిళలు, విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి ఈనెల 10 వరకు ఈసీ ఉత్తర్వులు అమలు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటునిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకుండా, ఎన్వోసీ జారీ చేయకుండా ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నవతరం పార్టీ ధర్మాసనం ముందు 4 అప్పీళ్లు దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఎలా అసాధారణం? ఈ అప్పీళ్ల గురించి నవతరం పార్టీ తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన నాదకర్ణి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిధుల పంపిణీకి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై తక్షణమే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. అందరి వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి రాత్రి 10.35 గంటల సమయంలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారని నాదకర్ణి అనగా.. ఎలా అసాధారణం అవుతాయని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించింది. ‘సంక్షేమ పథకాల నిధులనే కదా సింగిల్ జడ్జి పంపిణీ చేయవచ్చని చెప్పింది. అందులో తప్పేముంది? ఆ పథకాలు పాతవే కదా ’అని వ్యాఖ్యానించింది. ఇవి రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలు.. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, సంక్షేమ పథకాల కింద నిధుల పంపిణీకి వీల్లేదని నాదకర్ణి అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘నియమావళి అమల్లో ఉండగా, పథకాలు అమలుకు ఈసీ అనుమతులు తప్పనిసరా? ఏ చట్టంలో ఉందో చెప్పాలి’అనగా.. నాదకర్ణి ఎన్నికల నియమావళి గురించి చెప్పడం మొదలు పెట్టారు. ధర్మాసనం కలి్పంచుకొని.. ‘ఈసీ ఏదైనా ఉత్తర్వులిస్తే కోర్టులు ఏమీ చేయకూడదంటారా? కోర్టులకన్నా ఈసీ ఎక్కువని భావిస్తున్నారా?’అంటూ నిలదీసింది. ప్రస్తుతం కోర్టు ముందున్న పథకాలు పాతవని, రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలని ధర్మాసనం గుర్తు చేసింది. తెలంగాణలో రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతినిచి్చన విషయాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే నిధుల పంపిణీ జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు అనుమతించరని నిలదీసింది. మా అధికారులనే బెదిరిస్తారా? ఈ అప్పీల్ దాఖలులో నవతరం పార్టీ న్యాయవాదుల తీరుపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హౌస్ మోషన్ పిటిషన్ వేయాలంటూ ఫోన్ చేసి మా రిజిస్ట్రీని, మా అధికారులనే బెదిరిస్తారా? తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తారా?’అంటూ గట్టిగా నిలదీసింది. ‘మీ దెబ్బకు రిజిస్ట్రీ నాకు ఫోన్ చేసింది. ఉదయాన్ని లేచి చూస్తే రిజిస్ట్రీ నుంచి నా ఫోన్కు మెసేజ్లతో పాటు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా రిజిస్ట్రీని మీరు ఉదయం 5 గంటలకే నిద్ర లేపుతారా? అంత ఉదయాన్నే నిద్ర లేచి మీ సేవలో ఉండాలని భావిస్తున్నారా? మేము ఆ సమయంలో నిద్ర లేచి మీ పిటిషన్ను హౌస్మోషన్ రూపంలో విచారించాలని భావిస్తున్నారా’అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంకా నయం తనకు నేరుగా ఫోన్ చేయలేదని సీజే ఘాటుగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? అనంతరం ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మీరు అభ్యంతరం చెప్పలేదు. మీకు అభ్యంతరం ఉంటే మా ముందు అప్పీల్ చేసేవారు. అప్పీల్ చేయనప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేయాలి. అప్పీల్ వేయకుండా సింగిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండటం ఏమిటి? మీ తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలను వారి సొమ్ము వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎన్నికల బరిలో ఉన్న వారందరికీ సమాన అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) కల్పించేందుకే పథకాల అమలును ఆపామని మీరు చెబుతున్నారు. కానీ గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు బంధు పథకాలకు అనుమతినిచి్చ, ఇప్పుడు ఇక్కడ పథకాలను ఆపడం ద్వారా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదన్న విషయాన్ని మీరే రుజువు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో మీరు ఇలాగే ప్రభుత్వ పథకాలను ఆపుతున్నారా’అంటూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కో రకంగా..అసలు నిధుల పంపిణీ సంగతి ఏమిటని ధర్మాసనం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ను ధర్మాసనం ప్రశ్నించింది. 10వ తేదీన నిధుల పంపిణీకి సింగిల్ జడ్జి అనుమతినిచి్చన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేశారన్నారు. నిధుల పంపిణీకి ఎన్వోసీ జారీ చేయాలని కోరారన్నారు. ఎన్వోసీ విషయాన్ని తేల్చని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ కేటాయింపులు, పథకాలు అమలవుతున్న తేదీల వివరాలను అడుగుతూ సీఎస్కు లేఖ పంపిందని వివరించారు. ఎన్ఈవోసీ విషయాన్ని ఏం చేసిందో ఈసీనే అడగా లని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ఎన్నికల సంఘం తీరు ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కోరకంగా ఉంటోందన్నారు. గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు అనుమతిచి్చందని, ఇందుకు పాత పథకాలన్న కారణం చెప్పిందన్నారు. ఇప్పుడు తాము కూడా పాత పథకాలనే అమలు చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెబుతోందన్నారు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా? దీంతో ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరణను ధర్మాసనం కోరింది. నిధుల పంపిణీ వద్దంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా నిధులు పంపిణీ చేసుకోవచ్చని చెప్పలేదని అవినాష్ దేశాయ్ అనగా.. ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మీ ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్లో పెట్టిన తరువాత ఆ ఉత్తర్వులు అమలు చేయడమే మీ పని. కానీ మీరేం చేశారు? కోర్టుకన్నా మీరు ఎక్కువని అనుకుంటున్నారా’అంటూ ప్రశ్నించింది. ‘ఈసీ ఇలాగే ప్రతి పథకాన్ని అడ్డుకోవచ్చా? అది ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు, వేరే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా అన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న’అని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఈ అప్పీళ్లపై విచారణ జరిపి, సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలించి, తాము నిర్ణయించిన మేరకు ఉత్తర్వులిచి్చ, ఆ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి వచ్చేసరికి రాత్రి అవుతుందని తెలిపింది. బ్యాంకుల పని వేళలు సాయంత్రంతో ముగుస్తాయని, అలాంటప్పుడు ఈ నెల 10న నిధుల పంపిణీ ఎలా సాధ్యమవుతందని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో తాము ఈ అప్పీళ్లపై ఇప్పటికిప్పుడు తేల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపింది. ఎన్నికల సంఘం వల్లే నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదు దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఈసీ అమలు చేయకపోవడం వల్ల, ఎన్ఈవోసీ ఇవ్వకపోవడం వల్ల నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఏజీ శ్రీరామ్ వివరించారు. ఈ అప్పీళ్లను ఇప్పటికిప్పుడు తేల్చకపోయినా, ఈసీ తీరును మాత్రం ఖచి్చతంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవచ్చా అన్న విషయాన్ని తేల్చాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ‘14వ తేదీ నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని మీరు (ఎన్నికల సంఘం) చెబుతున్నారు. అప్పుడైనా నిధుల పంపిణీకి అనుమతిస్తారా లేక ఇలాగే ఆ వివరాలు, ఈ వివరాలు కావాలని అడుగుతూ వెళ్తారా’అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. అలాంటిది ఏమీ లేదని, 14 నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈసీ అనుమతి ఇవ్వని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ ఉత్తర్వులిచ్చింది. ఈ అప్పీళ్లపై తదుపరి విచారణను సెప్టెంబర్ 2న చేపడతామని ధర్మాసనం పేర్కొంది.మోకాలడ్డింది చంద్రబాబే! ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు నక్కజిత్తులు మరోసారి బయటపడ్డాయి. నవతరం పార్టీతో పిటిషన్లు దాఖలు చేయించడం ద్వారా రైతులు, మహిళలు, విద్యార్థులకు సంక్షేమ నిధులు అందకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు మరోమారు మోకాలడ్డారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకు వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.14,165 కోట్లు శుక్రవారం లబి్ధదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేరుగా కోర్టును ఆశ్రయిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు దొడ్డిదారిని వెతుక్కున్నారు. తనతో సన్నిహితంగా ఉండే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అనే అనామక పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంతో హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయించారు. అంతేకాక ఒక్క రోజు వాదనలకు రూ.20 లక్షల వరకు వసూలు చేసే మీనాక్షి అరోరా (రామోజీరావు తరపున మార్గదర్శి కేసుల్లో హాజరయ్యే న్యాయవాది), దేవ్దత్ కామత్ (రాజధాని కేసులో న్యాయవాది), ఎస్.నాదకర్ణి నవతరం పార్టీ తరపున వాదనలకు దించారు. ఇంత ఖరీదైన లాయ ర్లను పెట్టుకొనే స్థోమతు ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు లేదు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ, వాదనలతో సాయంత్రం అయిపోయింది. దీంతో ని ధుల విడుదలపై సింగిల్ జడ్జి ఇచి్చన గడువు ముగిసిపోయింది. ఫలితంగా ప్రభుత్వం నగ దు విడుదల చేసినప్పటికీ లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేయలేకపోయింది. చంద్రబాబు చేసిన ఈ పాపానికి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీకి రెండు చోట్ల గాజు గ్లాసు గుర్తు వచ్చింది. దీంతో ఆయన చంద్రబాబును కలిసి లోపాయికారీ ఒప్పందం ప్రకారం ఎన్నికల నుంచి తప్పుకున్నారు. పైగా టీడీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా తన సంపూర్ణ మద్దతును టీడీపీకి ప్రకటించడం గమనార్హం. -
మీ భూమి మీదే..
బాబు సృష్టించిన తప్పుడు ప్రచారాలు.. » మీ ఆస్తులకు జిరాక్సు కాపీలు ఇస్తారు. ఒరిజినల్ పత్రాలు ఇవ్వరు.. – ఇది పచ్చి అబద్ధం» మీ ఆస్తులకు గ్యారంటీ ఉండదు. మీ భూములు లాక్కుంటారు.. – ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది..» మీ ఇళ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు. మీ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి.. – స్థలాలను ఎత్తుకెళ్తారనేది అపోహే» కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.. – నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లొచ్చు.» మీ వారసులకు భూములు దక్కవు.. – మీ వారసులకే భూములు దక్కుతాయి» ఇది కేంద్ర చట్టం కాదు. రాష్ట్రమే తెచ్చింది.. – కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఈ చట్టం గురించి సిఫారసు చేసింది» మీ పాసు పుస్తకాలు మీ దగ్గర ఉండవు.. – మీ పాస్ పుస్తకాలు మీ దగ్గరే ఉంటాయి ప్రజలారా చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు» భూముల్ని మింగిన చంద్రబాబు మీ భూముల్ని కాపాడతాడా?» అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని దోచేసిన వాడు భూముల రక్షకుడా?» విశాఖలో లక్ష ఎకరాల భూముల రికార్డుల్ని మాయంచేసిన మాయావి మీ భూములకు భద్రత కల్పిస్తాడా?» వైఎస్ జగన్ హయాంలో ఒక్క భూకుంభకోణం జరగలేదు» చంద్రబాబు హయాంలో అమరావతి భూముల కుంభకోణం, విశాఖ లక్ష ఎకరాల కుంభకోణం, సదావర్తి భూముల కుంభకోణం వంటివి ఎన్నో జరిగాయి.» జగన్ హయాంలోనే భూములకు రక్షణ.» చుక్కల భూములకూ విముక్తి కల్పించింది జగ¯ó...» షరతుల గల పట్టా భూములకూ విముక్తి కల్పించింది జగన్» అసైన్డ్ భూములకూ హక్కులు ఇచ్చినవాడు జగన్» చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్ భూములు ఇచ్చాడు.ఇక దుర్మార్గాలేంటి?ళీ మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారు. » చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. » అలాగే, పవన్కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్స్ తీసుకున్నాడు. కానీ, ప్రజలను మాత్రం జిరాక్సు కాపీలని భయపెడుతున్నాడు.» అధికారం, డబ్బు, కండబలంతో మీ భూముల్నిఎవరూ కొట్టేయలేరు. అది అసాధ్యం» మీ వారసుల్ని నిర్ణయించేది మీరే. అందులోఅధికారుల ప్రమేయం ఉండనే ఉండదు» జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చనేది చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారం» ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ చట్టమేలేదు. అలాంటప్పుడు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ని ఎలా నియమిస్తారు?» ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగాకోర్టుకు వెళ్లొచ్చు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం వాస్తవాలు..» ప్రజల ఆస్తులను కాపాడ్డానికే ‘ల్యాండ్ టైట్లింగ్’ » దీన్ని ఇంకా అమలు చేయడంలేదు. అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇచ్చింది. అమలుకు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు» నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ చట్టం అమలుచేయలేరు» రాష్ట్రమంతటా ఈ చట్టం ఒకేసారి అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలన్నీ పరిష్కరమయ్యాక,గ్రామాల వారీగా భూముల తుది రిజిస్టర్ రూపొందించిన చోట్ల కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది.» నోటిఫికేషన్ ఇవ్వాలంటే రీసర్వే పూర్తవ్వాలి. ఆరు వేల గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో పూర్తవ్వాలి. అప్పుడే చట్టం అమలుచేసే అవకాశం ఉంటుంది. » ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధంలేదు. భూపత్రాలు యాజమానుల వద్దే ఉంటాయి. జిరాక్సు కాపీలు ఇస్తారనేది దుర్మార్గపు ప్రచారం» ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలైనా కోర్టుకు నిస్సంకోచంగా వెళ్లవచ్చు. » వారసత్వ ఆస్తులను మ్యుటేషన్ తరహాలోనే చేసుకోవచ్చు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దాన్ని నిర్ణయించలేడు. » ఈ చట్టం 90 దేశాల్లో అమల్లో ఉంది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైట్లింగ్ మోడల్ చట్టం చేసింది.» 2019లో నీతి అయోగ్ అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని చెప్పింది» ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు తెలిపింది. -
Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. -
మీ దస్తావేజులు మీకే ఇస్తారు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో మాట్లాడేందుకు ‘పచ్చ’ముఠాకు ఏమీలేక భూముల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు తనకు ఉచ్ఛనీచాలు లేవని చాటుకుంటున్నాడు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి భయంకరమైన కుట్రకు తెరలేపాడు. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించాడు. వాటిని తాను స్వయంగా చెప్పడంతోపాటు ఏకంగా పత్రికల్లో ఫుల్పేజీ ప్రకటనలు జారీచేశాడు. ప్రజలను భయపెట్టేందుకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన మొట్టమొదటి నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. భూములపై దు్రష్పచారాలను తొలుత ఎల్లో మీడియాతో చేయించి ఆ తర్వాత తానే ఆ విషయాలను చెబుతూ వికృత తాండవం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ దుష్ప్రచారాన్ని పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా మరీ చేస్తుండడం చంద్రబాబు బరితెగింపునకు పరాకాష్ట. ఈ దు్రష్పచారాలపై వాస్తవాలివే.. పచ్చి అబద్ధం.. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరనేది టీడీపీ సృష్టించిన భయంకరమైన అపోహ. ఏడాదిగా 9,58,296 స్థిరాస్తుల రిజి్రస్టేషన్లుగా జరగ్గా సంబంధిత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు.15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలాగే ఇచ్చారు. 1.75 లక్షల మందికి టిడ్కో ఇళ్లను రిజి్రస్టేషన్ చేసి ఒరిజినల్ పత్రాలు ఇచ్చారు. ఈ–స్టాంపింగ్ పైనా ఎడతెగని దు్రష్పచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2016లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్లను ఈ–స్టాంపింగ్ ద్వారా జారీచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీచేశారు. ఇవన్నీ ఒరిజినల్సే. ఏవి జిరాక్స్ కాపీలు కాదు. మీ వారసులను నిర్ణయించేది మీరే.. సమస్య వస్తే కోర్టులకూ వెళ్లొచ్చు.. మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారనేది మరో దారుణమైన వక్రీకరణ. భూ యజమానులు తమ వారసులను తామే నిర్ణయించుకోవచ్చు. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వాన్ని నిర్థారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో వివాదం ఉంటే భూ యజమానులే కోర్టుకు వెళ్లాల్సి వుంటుంది. మీ ఆస్తి మీది కాదని టైట్లింగ్ ఆఫీసర్ చెప్పలేరు.. రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒకసారి రైతు పేరు చేరితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం వారు ఎటువంటి రికార్డు సమర్పించాల్సిన అవసరంలేదు. ఆ డేటాపై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదవుతాయి. ఈ రిజిస్టర్లోని పేర్లపై రెండేళ్లలోగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు కన్క్లూజివ్ టైటిల్ నిర్ధారణ అవుతుంది. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ (టీఆర్ఓ) ఇచి్చన ఈ నిర్ధారణ ఆర్డర్పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ ఆఫీసర్కి (ఎల్టీఏఓ)కి అప్పీలు చేసుకోవచ్చు. దానిపైనా సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. భూ యజమానులను జైల్లో ఎందుకు పెడతారు? సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ చంద్రబాబుకు మతి చెడిపోయి పత్రికల్లో పిచ్చి ప్రకటన ఇచ్చాడు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇవన్నీ వక్రభాష్యాలే. సరైన పత్రాల్లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో భయానక స్థితిని కల్పించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయినా, రాజకీయ లబ్దికోసం చంద్రబాబు బట్టలు విప్పేసుకుని మరీ దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఈ ప్రచారాన్ని ప్రింట్ మీడియాలో చేస్తే ఈసీ అనుమతి అవసరంలేదనే లొసుగును అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వృద్ధ నేత చేసే పనేనా ఇది? సిగ్గు విడిచి, ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి తన కోసం చేస్తున్న కుతంత్రం ఇది. చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. ఈ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు రూపుదిద్దుకోలేదు. దీని పరిధినీ నిర్ధారించలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులనూ నియమించనేలేదు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నాక మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధమంది. నిబంధనలు తయారుచేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి వచ్చాకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది.. నిజానికి.. ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతిచ్చింది. అంతేకాదు.. సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్ , ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్లన్నీ మూడేళ్లపాటు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకీ వ్యతిరేకంగా ఈ చట్టంలేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాబు బినామీ ఆస్తులు బయటకు వస్తాయనే దుష్ప్రచారం.. వాస్తవానికి.. రీ సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తుంది. అది జరిగితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు ఆయన ముఠా బలవంతంగా లాక్కుని బినామీ పేర్లపై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయోననే భయంతో సాధారణ జనంతో దీనికి ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల చట్టాలు చేస్తుంటాయి. వాటివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తే సవరణలు తెస్తారు. కానీ, ఒక చట్టాన్ని రద్దుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా చేసి తన విలువల స్థాయి ఏంటో ప్రదర్శించుకున్నారు. మేనిఫెస్టోలో అమలుచేయలేని అనేక హామీలిచ్చి నా ఈ ఒక్క దానిపైనే ఇంత దృష్టిపెట్టి గందరగోళం సృష్టించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? వారు దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఇది మంచిది కాదని ఒక్క మాటైనా చెప్పారా? రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అనేకమంది బీజేపీ ముఖ్యనేతలు తమ ప్రసంగాల్లో ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ చట్టం మంచిది కాదని బీజేపీ నాయకులతో చంద్రబాబు చెప్పించగలరా? కేవలం తమ బినామీ ఆస్తులను రక్షించుకునేందుకే ఎల్లోగ్యాంగ్ చేస్తున్న గందరగోళమే ఇదంతా?
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement