పెర్త్: ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మనోళ్లు బ్యాట్లెత్తేశారు. పోరాడకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు శుభారంభం అందించినా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఓపెనర్లు రహానె, ధవన్ జట్టుకు శుభారంభం అందించారు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో వోక్స్ బౌలింగ్లో ధవన్ అవుటవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత టీమిండియా బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. కోహ్లీ (8), రైనా (1) వెంటవెంటనే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ అలీ వీరిద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కోహ్లీ.. రూట్కు, రైనా.. వోక్స్కు క్యాచిచ్చారు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కాసేపటి తర్వాత అంబటి రాయుడు (12) అవుటవగా, నిలకడగా రాణిస్తున్న రహానె కూడా ఫిన్ బౌలింగ్లో అదే దారిపట్టాడు. ఫిన్ మరుసటి ఓవర్లో బిన్నీ అవుటవగా, కెప్టెన్ ధోనీ (17), ఆల్ రౌండర్ జడేజా (5) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. చివర్లో షమీ (25) రాణించడంతో స్కోరు అతికష్టమ్మీద 200 మార్క్ చేరుకుంది. షమీ అవుటవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
ముక్కోణపు సిరీస్లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరగా, మరో బెర్తు కోసం ఇంగ్లండ్, భారత్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సిరీస్లో ఇంగ్లండ్.. భారత్పై బోనస్ పాయింట్తో ఘనవిజయం సాధించింది. కాగా టీమిండియా బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ కు రెండు పాయింట్లు వచ్చాయి. భారత్ ఫైనల్ చేరాలంటే తాజా మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. ఈ మాత్రం స్కోరుతో గెలవాలంటే అద్భుతమే జరగాలి.
పెర్త్ వన్డే: మనోళ్లు మళ్లీ బ్యాట్లెత్తేశారు
Published Fri, Jan 30 2015 12:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement