ఫైనల్లో ప్రాంజల జంట | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ప్రాంజల జంట

Published Sat, Feb 24 2018 10:50 AM

pranjula enters final of ITF womens tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ పోరుకు చేరుకుంది. ఈజిప్ట్‌లోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్‌)–లీ పెచి (చైనీస్‌ తైపీ) ద్వయం 6–2, 6–2తో చార్లోటి రొమెర్‌ (ఈక్వెడార్‌)–హెలెన్‌ షోల్సెన్‌ (బెల్జియం) జంటపై గెలిచింది.

78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్‌ మార్టినా కోల్‌మాగ్నా (ఇటలీ)–వలెరియా సోలోవియా (రష్యా) జంటతో ప్రాంజల ద్వయం ఆడుతుంది. సింగిల్స్‌ విభాగంలో మాత్రం ప్రాంజల తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రాంజల తొలి రౌండ్‌లో 3–6, 2–6తో క్వాలిఫయర్‌ కరోలినా బెరెన్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓటమి చవిచూసింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement