'కోట'లో సెంచరీల మోత | Sakshi
Sakshi News home page

'కోట'లో సెంచరీల మోత

Published Fri, Nov 11 2016 3:14 PM

'కోట'లో సెంచరీల మోత

రాజ్కోట్:భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీల మోత మోగుతోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు సాధిస్తే... మూడో రోజు ఆటలో భారత్ రెండు సెంచరీలు నమోదు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ లో ముందుగా చటేశ్వర పూజారా శతకం నమోదు చేస్తే, ఆ తరువాత కాసేపటికి మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. పూజారా 169 బంతుల్లో  15 ఫోర్లతో శతకం సాధిస్తే, మురళీ విజయ్ 256 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ చేశాడు.

Advertisement
Advertisement