కష్టపడి 100 | Sakshi
Sakshi News home page

కష్టపడి 100

Published Fri, May 1 2015 5:29 PM

punjab score 100/6

న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 17.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను మిల్లర్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 56 పరుగులు జోడించడంతో పంజాబ్ కష్టపడి 100 పరుగులు దాటింది.

102 పరుగుల స్కోరు వద్ద అక్షర్ పటేల్(22) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. మిల్లర్(41), థాకూర్(0)  క్రీజ్ లో ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్(2), మార్ష్(5), వోహ్రా(1), సాహా(3)  స్వల్ప స్కోరుకే అవుటయ్యారు.

Advertisement
Advertisement