Sakshi News home page

వారియర్స్ ‘హ్యాట్రిక్’

Published Sat, Jan 31 2015 12:43 AM

Punjab Warriors for the third consecutive victory

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వారియర్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో నెగ్గింది.

పంజాబ్ తరఫున సిరియెల్లో, సునీల్, యూసుఫ్ ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీకి సిమోన్ చైల్డ్ ఏకైక గోల్ అందించాడు. పంజాబ్ 17 పాయింట్లతో లీగ్‌లో అగ్రస్థానంలో ఉంది.
 
 

Advertisement

What’s your opinion

Advertisement