బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన పంజాబ్

Published Sat, May 9 2015 3:57 PM

బ్యాటింగ్ కు దిగిన పంజాబ్

కోల్ కతా: ఐపీఎల్ -8లో భాగంగా శనివారం సాయంత్రం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. మురళీ విజయ్, మనన్ వోహ్రా ఓపెనర్లుగా వచ్చారు.  ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్  లో జరుగుతోంది. ఈ సీజన్లో భాగంగా ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గి నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం ఆడిన 11 మ్యాచ్ల్లో ఆరింటిలో నెగ్గింది. నాలుగింటిలో ఓడింది. మరొక మ్యాచ్ టై అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పట్టికలో 13 పాయింట్లతో నైట్ రైడర్స్ జట్టు మూడో స్థానంలో ఉంది.

Advertisement
Advertisement