రైతుల కోసం రహానే విరాళం | Sakshi
Sakshi News home page

రైతుల కోసం రహానే విరాళం

Published Mon, Sep 14 2015 11:59 PM

రైతుల కోసం రహానే విరాళం

ముంబై: భారత క్రికెటర్ అజింక్య రహానే రైతులను ఆదుకునే విషయంలో పెద్ద మనసును ప్రదర్శించాడు. మహారాష్ట్రలో కరవు బారిన పడిన రైతుల సంక్షేమం కోసం తన వంతుగా రూ. 5 లక్షల విరాళం ప్రకటించాడు.

ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను సోమవారం అతను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేశాడు. తరచుగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ రాష్ట్రంలో సమస్యపై స్పందించిన తొలి క్రికెటర్ రహానే కావడం విశేషం.
 

Advertisement
Advertisement