సెమీఫైనల్లో రామ్‌కుమార్

24 Jul, 2016 09:29 IST|Sakshi
సెమీఫైనల్లో రామ్‌కుమార్

బింగ్‌హమ్‌టన్ (యూఎస్‌ఏ): ఏటీపీ యూఎస్ చాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు రామ్ కుమార్ రామనాథన్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. శనివారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 7-6 (5), 6-7 (3), 6-2తో బ్రిడన్ క్లెవిన్ (బ్రిటన్)పై విజయం సాధించాడు.

ఆదివారం జరిగే సెమీస్‌లో రామ్ కుమార్... అమెరికాకు చెందిన మిచెల్ క్రూజర్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో క్రూజర్ 6-3, 7-6 (6)తో హిరోకి మారియా (జపాన్)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు.

మరిన్ని వార్తలు