ఐఓసీలో రణ్‌ధీర్‌కు గౌరవ సభ్యత్వం | Sakshi
Sakshi News home page

ఐఓసీలో రణ్‌ధీర్‌కు గౌరవ సభ్యత్వం

Published Thu, Dec 11 2014 12:32 AM

ఐఓసీలో రణ్‌ధీర్‌కు గౌరవ సభ్యత్వం

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాజీ ప్రధాన కార్యదర్శి రణ్‌ధీర్ సింగ్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ)లో గౌరవ సభ్యత్వం లభించింది. అశ్వినీ కుమార్ తర్వాత ఈ అవకాశం లభించిన రెండో వ్యక్తి రణ్‌ధీర్ కావడం విశేషం.
 
  13 ఏళ్ల పాటు ఐఓసీలో పూర్తి స్థాయి సభ్యుడిగా పని చేసిన రణ్‌ధీర్‌ను గౌరవిస్తూ మొనాకోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇందులో రణ్‌ధీర్ కూడా పాల్గొన్నారు. ఐఓఏ తరఫున అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ దీనికి హాజరయ్యారు.
 

Advertisement
Advertisement