కోల్కతా: త్వరలో వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ మంచి ఫామ్లో ఉన్నా, ఆ జట్టుపై టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.
అటు విరాట్ నేతృత్వంలో, ఇటు కుంబ్లే పర్యవేక్షణలో భారత జట్టుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసిన గంగూలీ.. ఇటీవల టీ 20వరల్డ్ కప్ను గెలిచిన విండీస్ను ఆ దేశంలో తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు. విండీస్ పర్యటనలో భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ చెలరేగే అవకాశం ఉందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.