చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో? | Sakshi
Sakshi News home page

చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?

Published Sun, May 14 2017 7:50 PM

చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా ఒకే ఒక్క లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, మరో రెండు రోజుల్లో నాకౌట్ పోరుకు తెరలేవనుంది.    ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ లో గెలిచిన పుణె చివరిగా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇదిలా ఉంచితే , ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్-రాయల్ చాలెంజర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. 

 

ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు విజయాలు సాధించగా, ఆర్సీబీ మాత్రం రెండు విజయాల్నే తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఐపీఎల్ -10లో ఇదే చివరి లీగ్ కావడంతో గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. మరొకవైపు చివరి లీగ్ లో గెలుపు ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Advertisement
Advertisement