ఆంధ్రను గెలిపించిన రికీ భుయ్

3 Mar, 2014 00:43 IST|Sakshi
ఆంధ్రను గెలిపించిన రికీ భుయ్

బెంగళూరు: రికీ భుయ్ (79 బంతుల్లో 103 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రశాంత్ (106 బంతుల్లో 90; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో... సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో గోవాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా 50 ఓవర్లలో 6 వికెట్లకు 268 పరుగులు చేసింది. సగుణ్ కామత్ (101 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్సర్), హనుమంత్ గడేకర్ (71 బంతుల్లో 61; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. రాహుల్ కెనీ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్సర్), అమిత్ యాదవ్ (29 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగారు.
 
 విజయ్‌కుమార్, అచ్యుత రావు చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 272 పరుగులు చేసి గెలిచింది. భరత్ (18), సాయి కృష్ణ (3), సుమంత్ (13), చిరంజీవి (9), శివ కుమార్ (0) విఫలమయ్యారు. అయితే రికీ భుయ్... ప్రశాంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 51; స్వరూప్ కుమార్ (27 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ఆంధ్రకు 4 పాయింట్లు దక్కాయి.
 

మరిన్ని వార్తలు