-
నటుడి మనవరాలి పెళ్లి.. హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్లో ఈ వివాహా వేడుక జరిగింది. కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో కూడా నటించారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
యాక్టర్ విజయ కుమార్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్
టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రముఖ నటుడు విజయ కుమార్. ఆయన మనుమరాలి పెళ్లి ఈ నెలలో జరగనుంది. ఆ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయ కుమార్కు రెండు వివాహాలు జరిగాయి. ఆయన మొదటి భార్య ముత్తులక్ష్మి, రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు కవిత, అనిత ఉన్నారు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లతో పాటు కుమారుడు అరుణ్ ఉన్నాడు. అతను నటుడిగా స్థిరపడితే ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి కొన్ని సినిమాలలో నటించారు. వీరందరికీ వనిత విజయ కుమార్ మాత్రం ఒంటరిగా దూరంగా ఉన్నారు. (భర్త గోకుల్ కృష్ణన్తో అనిత విజయ కుమార్) విజయ్ కుమార్ పిల్లలు అందరూ సినిమా పరిశ్రమకు దగ్గర్లో ఉన్న వారే.. కానీ ఆయన మొదటి భార్య కుమార్తె అయిన అనిత మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె కూతురు ధియాకు వివాహం కానుంది. 1973లో జన్మించిన అనితా విజయకుమార్ ప్రముఖ డాక్టర్గా ఉన్నారు. గోకుల్ కృష్ణన్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుని ఖతార్లో ఆమె స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనిత కూతురు థియా కూడా డాక్టర్గా స్థిరపడింది. గతేడాదిలో తిలాన్ అనే యువకుడితో థియా నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియా- తిలాన్ జంట ఈ నెలలో ఒకటి కానున్నారు. వారి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది. ఈ పెళ్లికి అనిత తన తండ్రి విజయకుమార్, సోదరి కవితతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఆ విధంగా రజనీ, సూర్య, ధనుష్ కుటుంబాలను అనిత స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె విడుదల చేశారు. తాజాగా తన కూతురు ఖతార్ నుంచి చెన్నైకి వచ్చింది. ఆ వీడియోను అనిత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో థియా అమ్మమ్మ హారతి ఇవ్వడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: మెట్రోనగరాల్లో తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ స్టాన్లీ ఉదోకాఇయూలను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ నాబ్) అధికారులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.8 కోట్ల విలువైన ఎనిమిది రకాలైన మాదకద్రవ్యాలు స్వాదీనం చేసుకున్నట్టు పశ్చిమ మండల డీసీపీ ఎం.విజయ్కుమార్ చెప్పారు. ఎస్పీ కేసీఎస్ రఘువీర్, ఏసీపీఎస్.మోహన్కుమార్, ఇన్స్పెక్టర్ పి.రాజేష్ తో కలిసి పంజగుట్ట ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బిజినెస్ వీసాపై ముంబై వచ్చి... గోవాలో స్థిరపడి నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009 నవంబర్లో బిజినెస్ వీసాపై ముంబైకి వచ్చాడు. తొలినాళ్లలో రెడీమేడ్ వ్రస్తాల వ్యాపారం చేశాడు. వ్యాపార విస్తరణలో భాగంగా 2012లో తన మకాం గోవాకు మార్చాడు. అక్కడి కండోలిమ్ ప్రాంతంలో కొందరు స్నేహితులతో కలిసి ఉంటూ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేశాడు. పాస్పోర్టు పోగొట్టుకొని, వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్టవేశాడు. ఈ విషయం పసిగట్టిన గోవా పోలీసులు అరెస్టు చేయడంతో ఆరు నెలలు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కండోలిమ్లోనే ఉండే రాజస్తానీ యువతి ఉషాచండేల్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే తన భర్త నుంచి వేరుపడిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్టాన్లీ గ్రోసరీ పేరుతో కిరాణ దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడకు సరుకులు ఖరీదు చేయడానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లతో స్టాన్లీకి పరిచయమైంది. ఓ దశలో ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్న స్టాన్లీకి ఈ ఇద్దరూ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కువ లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. సేల్స్ నుంచి సప్లై చైన్ వరకు... తొలినాళ్లలో స్టాన్లీ ఆ ఇద్దరు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తీసుకొని స్థానికంగా విక్రయించేవాడు. వస్త్ర వ్యాపారంలో కంటే ఎక్కువ లాభాలు వస్తుండటంతో దీనినే కొనసాగించాడు. ఇద్దరు మిత్రులు నైజీరియాకు వెళ్లడంతో వారి డ్రగ్స్ వ్యాపారాన్నీ స్టాన్లీ టేకోవర్ చేశాడు. విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించడం, స్థానికంగా ఉన్న పెడ్లర్స్కు సప్లై చేయడం... ఇలా ఓ డ్రగ్స్ చైన్ ఏర్పాటు చేశాడు. 2017లో ఇదే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బయటకు వచ్చాక డ్రగ్స్ దందాను మరింత విస్తరించాడు. నైజీరియాతోపాటు నెదర్లాండ్స్లో ఉన్న డ్రగ్ సప్లయర్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆర్డర్లు ఇస్తూ కొరియర్తో పాటు విమానాల్లో వివిధ రకాలైన డ్రగ్స్ తెప్పించుకునేవాడు. ఆయా దేశాల నుంచి కొందరు ట్రాన్స్పోర్టర్లు పెద్ద క్యాప్సూల్స్ రూపంలో కడుపులో దాచుకొని, బ్యాగుల్లోని రహస్య అరల్లో సర్దుకుని తీసుకొచ్చేవారు. మాదకద్రవ్యాలు ముంబై టు గోవా మాదకద్రవ్యాలు తొలుత ముంబై వచ్చేవి. అక్కడ ఉన్న సప్లయర్స్ ద్వారా గోవాకు తెప్పించుకునేవాడు. వీటిని కస్టమర్లతో పాటు ఇతర పెడ్లర్స్కు సరఫరా చేయడానికి ముగ్గురు దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రయాణ ఖర్చులతో పాటు ఒక్కో గ్రాము డెలివరీ చేసినందుకు రూ.2 వేల కమీషన్ ఇచ్చేవాడు. నైజీరియా వెళ్లిన ఇద్దరు మిత్రులు సైతం తమ పాత కస్టమర్ల ద్వారా వారికి వచ్చే ఆర్డర్స్ను వాట్సాప్ ద్వారా ఇతడికి పంపేవారు. ఇలా చేసినందుకు వారికీ గ్రాముకు రూ.2 వేలు కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించిన స్టాన్లీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 511 మంది కస్టమర్లు ఉండగా, వారిలో ఏడుగురు నగరానికి చెందిన వారు. ఆర్థిక లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ లేదా హవాలా రూపంలో చేస్తుంటాడు. ముంబైలో వస్త్రవ్యాపారం చేస్తుండగా పరిచయమైన నెట్వర్క్నే వాడుకుంటున్నాడు. స్టాన్లీ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోవాలో రూ.కోటి ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఎస్ఆర్ నగర్లో దొరికిన తీగ లాగితే... టీఎస్ నాబ్ అధికారులు గత నెల 18న ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 38 ఎక్స్టసీ పిల్స్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కీలక నిందితుడైన బాబూసోను లోతుగా విచారించగా, డ్రగ్స్ స్టాన్లీ ద్వారా వస్తున్నాయని తేలింది. దీంతో గోవా వెళ్లిన టీఎస్ నాబ్ పోలీసులు నెల రోజులు శ్రమించి స్టాన్లీ ఆచూకీ కనిపెట్టారు. అతడి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు మంగళవారం డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి పంజగుట్టకు వచ్చినట్టు తెలుసుకున్నారు. అక్కడ వలపన్ని స్టాన్లీని పట్టుకోవడంతో పాటు అతడి నుంచి 557 గ్రాముల కొకైన్, 902 ఎక్స్టసీ మాత్రలు, 21 గ్రాముల హెరాయిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 105 ఎల్ఎస్డీ బోల్ట్స్, 215 గ్రాముల చరస్, 7 గ్రాముల యాంఫెటమైన్, 190 గ్రాముల గంజాయి, 8 సెల్ఫోన్లు, రూ.5.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సిటీలోని ఏడుగురు కస్టమర్ల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ దందా వివరాలు తెలిసిన వారు 8712671111కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్
-
ఈ కేసులో ఎంతటివారినైనా వదినే ప్రసక్తిలేదు: వెస్ట్ జోన్ డిసిపి విజయ్కుమార్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement