మరో విజయం సాధిస్తే సానియా-బోపన్న జంటకు పతకం
మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో భారత జోడీ
కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత అభిమానుల నిరీక్షణకు తెరపడేలా కనిపిస్తోంది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో భారత జోడి సానియా మీర్జా-రోహన్ బోపన్న సెమీస్కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. సెమీస్లో గెలిస్తే స్వర్ణం లేదా రజతం దక్కుతుంది. ఒకవేళ సెమీస్లో ఓడిపోయినా... కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మీరు ఈ వార్త చదివే సమయానికి మనవాళ్లు ఫైనల్కు చేరి కనీసం స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఆశ్చర్యపోకండి!
రియో డి జనీరో: అంతా అనుకున్నట్లు జరిగితే రియో ఒలింపిక్స్లో భారత్ పతకాల బోణీ చేయనుంది. టెన్నిస్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-రోహన్ బోపన్న ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పతకానికి కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-4, 6-4తో ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో సానియా-బోపన్న తలపడతారు.
ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జంట ఫైనల్కు చేరుకుంటుంది. తద్వారా రజతం లేదా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ సెమీస్లో ఓడినా సానియా-బోపన్నలకు కాంస్య పతక అవకాశాలు సజీవంగా ఉంటాయి. మిక్స్డ్ డబుల్స్ రెండో సెమీస్లో ఓడిన జోడీతో (బెథానీ మాటెక్ సాండ్స్-జాక్ సోక్ లేదా రాడెక్ స్టెపానెక్-లూసీ హర్డెకా) సానియా-బోపన్న ఆడాల్సి ఉంటుంది.
డబుల్స్లో అంతగా అనుభవం లేని ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న పూర్తి సమన్వయంతో ఆడారు. నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పదునైన రిటర్న్లతో ఆధిపత్యం కనబరిచారు. ఏడో గేమ్లో హితెర్ సర్వీస్ను బ్రేక్ చేసిన భారత జంట ఎనిమిదో గేమ్లో తమ సర్వీస్నూ కాపాడుకొని 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్లో ముర్రే సర్వీస్ను నిలబెట్టుకున్నా... పదో గేమ్లో బోపన్న ఏస్లతో అలరించి సెట్ను అందించాడు.
రెండో సెట్లో ఐదో గేమ్లో ముర్రే సర్వీస్ను బ్రేక్ చేసిన భారత జంట ఆ తర్వాత 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో సెట్నూ 6-4తో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సానియా-బోపన్న జంట ఏడు ఏస్లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయింది.
పతకం ముంగిట...
Published Sun, Aug 14 2016 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement