Sakshi News home page

డబుల్స్ విజేత రిషిక జోడి

Published Sat, May 10 2014 12:30 AM

Rishika Team won tennis Tournment

 సింగిల్స్‌లో ఫైనల్‌కు
 ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ
 
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రిషిక సుంకర సత్తా చాటుతోంది. సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరడంతోపాటు డబుల్స్‌లో షర్మదా బాలుతో కలిసి విజేతగా నిలిచింది.
 
 మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎంటీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిషిక-షర్మద జోడి 6-1, 7-5 తేడాతో ప్రార్థనా తొంబరే-శ్వేతా రాణా ద్వయంపై విజయం సాధించింది. ఇక సింగిల్స్ సెమీఫైనల్లో రిషిక 6-1, 6-0 తేడాతో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి చిలుములపై గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రార్థనా తొంబరే 7-6(5), 7-5 తేడాతో నటాషా ఫల్హాను ఓడించి తుదిపోరుకు చేరింది. రిషిక, నటాషాల మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది.
 

Advertisement
Advertisement