ముగిసిన భారత్ పోరు | Sakshi
Sakshi News home page

ముగిసిన భారత్ పోరు

Published Sun, Jul 26 2015 12:46 AM

Russian Open: Dismal day for India as Jayaram, Attri-Reddy and Akshay-Prajakta all lose

రష్యన్ ఓపెన్ బ్యాడ్మింటన్
 వ్లాదివోస్టోక్ (రష్యా): రష్యన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల పోరు ముగి సింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ అజయ్ జయరాం 17-21, 17-21 తేడాతో టాప్ సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఇక పురుషుల డబుల్స్‌లో మను అత్రి, బి.సుమీత్ రెడ్డి జోడి 21-19, 7-21, 16-21 తేడా తో టాప్ సీడ్ వ్లాదిమిర్ ఇవనోవ్, ఇవాన్ సొజొనోవ్ (రష్యా) చేతిలో.. మిక్స్‌డ్ డబుల్స్‌లో అక్షయ్ దెవాల్కర్, ప్రజక్తా సావంత్ జంట 10-21, 8-21తో జపాన్‌కు చెందిన యుటా వటనబే, హిగషినో చేతిలో పరాజయం పాలయ్యారు.
 

Advertisement
Advertisement