ఎదురీదుతున్న టీమిండియా! | Sakshi
Sakshi News home page

ఎదురీదుతున్న టీమిండియా!

Published Tue, Dec 30 2014 10:49 AM

ఎదురీదుతున్న టీమిండియా!

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఎదురీదుతోంది. 104 పరుగులకే ధోనీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.  చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది.

 శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ(54)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం అజ్యింకా రహానే(34), చటేశ్వర పూజారా(4) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement