భారత జట్టుకు సచిన్‌, సెహ్వాగ్‌ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

భారత జట్టుకు సచిన్‌, సెహ్వాగ్‌ శుభాకాంక్షలు

Published Fri, Oct 6 2017 6:35 PM

 Sachin, Sehwag Best wishes for indian football team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఫిఫా అండర్‌-17 వరల్డ్‌కప్‌లో పాల్గొనబోతున్న భారత జట్టుకు టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆటను ఆస్వాదిస్తూ మీ కలలను సాకారం చేసుకోవాలంటూ సచిన్‌ జట్టుకు విషేస్‌ తెలియజేస్తూ ట్వీట్‌ చేశాడు’. ట్విట్టర్‌ రారాజు సెహ్వాగ్‌ మాత్రం తొలి సారి ఫుట్‌ బాల్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు, టోర్నీలో పాల్గొంటున్న అండర్‌-17 జట్టుకు శుభాకాంక్షలు. మీరు అద్భుత ప్రదర్శనను ఇస్తారని భావిస్తున్నా. అని ట్వీట్‌ చేశాడు. ఇంకాసేపట్లో భారత్‌, అమెరికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement
Advertisement