లాహ్లి (రోహ్టక్): మొదటి మూడు బంతులు... పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి తన ట్రేడ్మార్క్ షాట్ స్ట్రెయిట్ డ్రైవ్తో ఫోర్... తర్వాతి రెండు బంతుల్లో మరో సింగిల్... ఏడో బంతికి క్లీన్బౌల్డ్!... ఇదీ తన ఆఖరి రంజీ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ సాగిన తీరు. హర్యానా బౌలర్ మోహిత్ శర్మ ఆఫ్ స్టంప్పై వేసిన గుడ్ లెంగ్త్ బంతిని సచిన్ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయాడు. అయితే అనూహ్యంగా ఎక్కువ ఎత్తులో లేచిన బంతి బ్యాట్ను దాటి మాస్టర్ మోచేతికి తగులుతూ వికెట్లపై పడింది. అంతే... ఒక్కసారిగా లాహ్లి మైదానంలో నిశ్శబ్దం. క్రికెట్ దిగ్గజం ఆటను ప్రత్యక్షంగా చూద్దామని గత వారం రోజులుగా ఉత్సుకతతో ఎదురు చూసిన అభిమానులను సచిన్ ప్రదర్శన తీవ్రంగా నిరాశ పరచింది. ఆఖరి రంజీ మ్యాచ్ అంటూ భారీ స్థాయిలో హడావిడి జరిగినా సచిన్ తన ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
రాణించిన మోహిత్శర్మ
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా, హర్యానా తమ తొలి ఇన్నింగ్స్లో 35.3 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ నాయర్ (4/38), జావేద్ ఖాన్ (2/12) ధాటికి జట్టు కుప్పకూలింది. పదో స్థానంలో బరిలోకి దిగిన మోహిత్ శర్మ (62 బంతుల్లో 49; 9 ఫోర్లు) ఒక్కడే పోరాడటంతో హర్యానా ఈ మాత్రం స్కోరు సాధించింది. అనంతరం ఆట ముగిసే సరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 44 ఓవర్లలో 4 వికెట్లకు 100 పరుగులు చేసింది. 38/3 స్కోరుతో ఉన్న జట్టును రహానే (96 బంతుల్లో 44 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఆదుకున్నాడు. మోహిత్కు 2 వికెట్లు దక్కాయి.
గౌరవ వందనం....
మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్కు ఘన సత్కారం జరిగింది. ఇక్కడి చౌదరి బన్సీలాల్ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి మాస్టర్కు మైదానంలోకి స్వాగతం పలికారు. దాదాపు 8 వేల మంది అభిమానులు సచిన్ నామస్మరణతో ఈ చిన్న మైదానాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సచిన్కు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ జ్ఞాపిక అందజేశారు. కపిల్దేవ్ సారధ్యంలో 1991లో ముంబైని ఓడించి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన హర్యానా జట్టులోని అనేక మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘రంజీ ప్రదర్శన ఒక్కటే సరిపోదు’
మరోవైపు... భారత జట్టుకు ఎంపికయ్యేందుకు రంజీ ట్రోఫీ ప్రదర్శన ఒక్కటే సరిపోదని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రంజీలో బాగా ఆడితే ఒక ఆటగాడిపై అందరి దృష్టి పడవచ్చు. అయితే భారత జట్టుకు ఎంపికయ్యేందుకు అదొక్కటే ప్రామాణికం కాదు. జట్టు అవసరాలకు అనుగుణంగా అతను సరిపోతాడా అనేది కూడా ముఖ్యం’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు.
రంజీ ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగాలని అతను అన్నాడు. 15 ఏళ్ల వయసులోనే తొలి రంజీ మ్యాచ్ ఆడిన సచిన్, అప్పటి బాంబే జట్టులో ఎనిమిది మంది టెస్టు క్రికెటర్లు ఉండటంతో తాను చాలా విషయాలు నేర్చుకోగలిగానని చెప్పాడు. 2000లో తమిళనాడుపై (సెమీఫైనల్లో) డబుల్ సెంచరీ చేసిన మ్యాచే తన రంజీ కెరీర్లో అత్యుత్తమని అతను చెప్పాడు. ‘చివర్లో రెండు వికెట్లు చేతిలో ఉండగా 42 పరుగులు చేయాల్సి ఉంది. ఆ 42 పరుగులు నేనొక్కడినే చేయడం ఇంకా గుర్తుంది’ అని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు.
సచిన్ (బి) మోహిత్ 5
Published Mon, Oct 28 2013 12:52 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
బీఆర్ఎస్ను కనుమరుగు చేయడమే లక్ష్యం
చల్లబడ్డ వాతావరణం
బీఆర్ఎస్ పార్టీకి, పదవులకు రాజీనామా
చేనేత నడ్డి విరిచిన కేంద్రం
భీంరెడ్డి పోరాటచరిత్ర మరువలేనిది
ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప
మాదిగలకు ద్రోహం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్
కలిసికట్టుగా పని చేయండి.. విజయం మనదే
తప్పక చదవండి
- అయ్యయ్యోసేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement