ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య

Published Tue, Jun 27 2017 10:38 AM

ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య శుభారంభం చేసింది. చండీగఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.

 

సోమవారం జరిగిన  సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సాయి దేదీప్య 6–2, 3–6, 7–6 (7/5)తో యుబ్రానీ బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌)పై విజయం సాధించింది. నేడు (మంగళవారం) జరిగే ప్రిక్వార్టర్స్‌లో హరియాణాకు చెందిన స్మృతి సింగ్‌తో సాయి దేదీప్య తలపడుతుంది.    

 

Advertisement
Advertisement