సాయి కార్తీక్‌కు పదోస్థానం | Sakshi
Sakshi News home page

సాయి కార్తీక్‌కు పదోస్థానం

Published Sat, Jul 28 2018 10:22 AM

Sai Kathik got 10th Place in Under 15 Chess Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అండర్‌–15 చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు సీహెచ్‌ సాయి కార్తీక్‌ రాణించాడు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ టోర్నీలో కింగ్స్‌ చెస్‌ అకాడమీకి చెందిన కార్తీక్‌ పదోస్థానంలో నిలిచాడు. దీంతో అతని ఎలో రేటింగ్‌ పాయింట్లలో గణనీయమైన పురోగతి లభించింది. అతని రేటింగ్‌ 1810 పాయింట్లు నుంచి 2070 పాయింట్లకి పెరిగింది.

Advertisement
Advertisement