ముగిసిన సైనా పోరు | Sakshi
Sakshi News home page

ముగిసిన సైనా పోరు

Published Sat, Dec 3 2016 12:42 AM

ముగిసిన సైనా పోరు

క్వార్టర్స్‌లో ఓడిన భారత స్టార్  
సాయిప్రణీత్ కూడా పరాజయం

మకావు: గాయం నుంచి కోలుకున్నాక ఆడిన మూడో టోర్నమెంట్‌లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 12-21, 17-21తో ప్రపంచ 226వ ర్యాంకర్ రుుమాన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది.

35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఏమాత్రం పోటీనివ్వలేకపోరుుంది. రెండో గేమ్‌లో సైనా తేరుకున్నా కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లోనూ భారత కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ సారుుప్రణీత్ 19-21, 9-21తో ప్రపంచ 125వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 

Advertisement
Advertisement