రెండో మ్యాచ్ కోల్పోయిన సైనా నెహ్వాల్‌ | Sakshi
Sakshi News home page

రెండో మ్యాచ్ కోల్పోయిన సైనా నెహ్వాల్‌

Published Thu, Dec 12 2013 7:07 PM

రెండో మ్యాచ్ కోల్పోయిన సైనా నెహ్వాల్‌

కౌలాంపూర్:  సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ రెండో మ్యాచ్‌ కోల్పోయింది. తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఈ హైదరాబాద్ అమ్మాయి గురువారం జరిగిన రెండవ లీగ్ మ్యాచ్‌లో  27 నిమిషాల్లో 9-21, 14-21తో వరల్ఢ్ నెంబర్ వన్  జురుయ్ లీ( చైనా) చేతిలో ఓడిపోయింది.

 

అయితే సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ఈ ఏడాది తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 21-19, 22-24, 19-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడిపోయింది.

Advertisement
Advertisement