Sakshi News home page

డబ్ల్యూటీఏ సెమీస్కు సానియా జోడీ

Published Fri, Oct 24 2014 11:08 AM

డబ్ల్యూటీఏ సెమీస్కు సానియా జోడీ

సింగపూర్ :  సానియా మీర్జా జోడీ సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ (ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్)  సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్  ఫైనల్స్లో కోప్స్-జోన్స్ జంటపై సానియా, కారా బ్లాక్ జోడీ 6-3, 2-6, 12-10 తేడాతో విజయం సాధించింది.  డబ్ల్యూటీఏ సెమీస్కు చేరటం సానియాకు ఇదే తొలిసారి. కాగా ఇంతకుముందు ముగ్గురు వేర్వేరు భాగస్వాముల (ఎలెనా లిఖోవ్‌త్సెవా, రెన్నీ స్టబ్స్, లీజెల్ హ్యుబర్)తో కలసి పదిసార్లు ఈ పోటీల్లో పాల్గొన్న కారా బ్లాక్ ఈసారి సానియాతో కలసి 11వ సారి బరిలోకి దిగింది.  ఈ ఏడాది చివర్లో కారా బ్లాక్ టెన్నిస్ నుంచి రిటైర్డ్ కానుంది.


 

Advertisement
Advertisement