టెస్టు కోసం నిధులు ఇచ్చుకోండి | Sakshi
Sakshi News home page

టెస్టు కోసం నిధులు ఇచ్చుకోండి

Published Wed, Nov 9 2016 1:42 AM

SC directs BCCI to incur expenses for England series, show accounts to Lodha panel

బీసీసీఐకి సుప్రీం కోర్టు అనుమతి  
 న్యూఢిల్లీ: ఇంగ్లండ్ జట్టుతో రాజ్‌కోట్‌లో జరగబోయే తొలి టెస్టుకు నిధుల కొరత తీరింది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి నిధులను విడుదల చేసేందుకు అంగీకరించాలని బీసీసీఐ మంగళవారం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. లేకుంటే టెస్టు రద్దయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రూ.58.66 లక్షల నిధులు విడుదల చేసేందుకు బీసీసీఐకి అనుమతించింది. డిసెంబర్ 3 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఇతర మ్యాచ్‌ల కోసం కూడా ఇంతే మొత్తాన్ని ఖర్చు చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అనుమతిచ్చింది. అయితే ఈ నిధులను ఆటగాళ్ల అలవెన్‌‌స, ఇన్సూరెన్‌‌స ఖర్చులకు, మూడో అంపైర్‌కు చెల్లింపు కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని, సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి మాత్రం కాదని పేర్కొంది.

Advertisement
Advertisement