భారత్-బంగ్లాల రెండో వన్డేకు వర్షం ఆటంకం | Sakshi
Sakshi News home page

భారత్-బంగ్లాల రెండో వన్డేకు వర్షం ఆటంకం

Published Sun, Jun 21 2015 6:44 PM

second one day between india and bangladesh inturpted by rain

మిర్పూర్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న రెండో వన్డేకు వర్షం ఆటంకం కల్గించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఇన్నింగ్స్ కొద్ది సేపట్లో ముగుస్తుందనగా వర్షం కురిసింది.  టీమిండియా 43.5 ఓవర్లలో  ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులతో ఆడుతున్న సమయంలో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపేశారు.

 

మ్యాచ్ నిలిచే సమయానికి రవీంద్ర జడేజా(19), భువనేశ్వర్ కుమార్(2) క్రీజ్ లో ఉన్నారు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ డకౌట్ గా ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరచగా, శిఖర్ థావన్(53), విరాట్ కోహ్లీ(23), మహేంద్ర సింగ్ ధోనీ(47), సురేష్ రైనా(34) ఫర్వాలేదనిపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement